ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో మన దేశ ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తూ, మొన్న ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, దానిని మే 3 వరకు పొడిగిస్తూ మొన్న మరొక ప్రకటన చేసారు. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్ ప్రభలకుండా ఉండడానికి ప్రజల మధ్య సామజిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, శానిటరీ సిబ్బంది మనకోసం ఎంతో శ్రమపడుతుండగా, పలువురు ప్రజలు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటువంటి విపత్కర సమయంలో మన కోసం, మన ఆరోగ్య రక్షణ కోసం, తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మన చుట్టుప్రక్కల ప్రదేశాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఎంతో గొప్ప మనసుతో మనకు రక్షణ కల్పిస్తున్న పారిశుధ్య కార్మికులకు చేతులు జోడించి ప్రత్యేకంగా వందనం చేస్తున్నానని, వారికి మన అందరి ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు కాసేపటి క్రితం తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారిపై ప్రజలకు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తనవంతుగా అవగాహన కల్పిస్తున్న సూపర్ స్టార్, నేడు పారిశుధ్య కార్మికులకు వందనం చెపుతూ మరొక్కసారి తన ఉదారతను చాటుకున్నారు….!!
This one is for all the sanitation workers deployed on our streets to make sure the surroundings are kept clean and sanitised. While we are safe in our homes, they come out everyday leaving their own to ensure we remain out of harm's way… pic.twitter.com/P26e9t4kzc
— Mahesh Babu (@urstrulyMahesh) April 16, 2020