కోలీవుడ్ సినిమా కణా కు రీమేక్ గా వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్. పరభాషా కథలను పర్ఫెక్ట్ గా తెలుగులో ప్రజెంట్ చేసే భిమానేని శ్రీనివాసరావు ఈ సందేశాత్మక కథకు దర్శకత్వం వహించారు .క్రియేటివ్ కమర్షియల్స్ కె ఎస్ రామారావు సమర్పణలో కె ఏ వల్లభ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఆగస్ట్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ,పాటలకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వేడుకకు స్పెషల్ గెస్ట్ గా రౌడీ స్టార్ విజయదేవరకొండ, హీరోయిన్ రాశీ ఖన్నా హాజరుకానున్నారు. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ జెఆర్సి కన్వెన్షన్ లో నేడు సాయంత్రం 6గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఐశ్వర్య రాజేష్ – శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.