కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ
కాశ్మీర్ లో ఉగ్రవాద దాడుల క్రూర చర్యను దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ బ్రేవ్ కామెంట్స్ చేశారు. సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. ఈ కార్యక్రమంలో విజయ్ కాశ్మీర్ పై చేసిన ఇన్స్ పైరింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే. నేను ఖుషి సినిమా షూటింగ్ కాశ్మీర్ లో చేశాం. అక్కడి ప్రజలు చాలా మంచివారు. కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ కు ఆ దేశ ప్రజలే బుద్ధి చెబుతారు. అన్నారు.