‘నర్తనశాల`చిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

0
305

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన పౌరాణిక చిత్రం `న‌ర్త‌న‌శాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుక‌గా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్‌బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు న‌ట‌సింహ‌ బాలకృష్ణ . తాజాగా `న‌ర్త‌నశాల` నుండి నందమూరి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుద‌ల చేశారు. ఇందులో అర్జునుడిగా బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మ‌రో పౌరాణిక పాత్ర‌లో బాల‌య్య‌ని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here