అతి త్వరలో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోగా నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, నేడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరి నుండి మంచి స్పందన లభించింది.
ఇకపోతే కాసేపటి క్రితం అభిమానులతో కలిసి తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా చాట్ సెషన్ లో పాల్గొన్న మహేష్ బాబు, తమ ‘సర్కారు వారి పాట‘ మూవీ మంచి మెసేజ్ తో పాటు ఆకట్టుకునే పలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపొందనుందని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లాక్ డౌన్ అనంతరం పరిస్థితులను బట్టి షూటింగ్ మొదలెట్టి వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి మీ ముందుకు తీసుకువస్తాం అంటూ ఫ్యాన్స్ తో చెప్పారు మహేష్ బాబు…….!!