కరోనా పై పోరాటానికి ఏపీ, తెలంగాణకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4 కోట్ల రూపాయల విరాళం

0
1027
Prabhas Announced 1 crore

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి మరింతగా ప్రబలకుండా ఉండాలని ఎక్కడికక్కడ ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి పలు దేశాలు. మన భారత దేశం లో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా పై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీ ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయల ,ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు , తెలంగాణ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు,  మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచన మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అందరూ సురక్షితంగా తమ ఇళ్ల వద్దనే ఉండాలని ప్రభాస్ ప్రజలను కోరారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here