‘అల వైకుంఠపురములో’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్……!!

0
880

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా అలరించడంతో పాటు సినిమాపై ఎన్నో అంచనాలు క్రియేట్ చేసాయి.

ఇక బన్నీ ఫ్యాన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ రిలీజ్ డేట్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ 11న టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దాని తాలూకు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని నేటి సాయంత్రం గం. 4.05 ని. లకు రిలీజ్ చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here