పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఎప్పటికపుడు తన సినిమాలు మరియు ఫ్యామిలి సంగతులను ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే సాయి తేజ్,
నేడు తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, మరియు మెగాస్టార్ తనయ శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ దంపతుల గారాల పట్టి నావిష్కలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ‘నవిష్క పాప స్మైల్ కి ఫైటింగ్, కిల్లింగ్, డైయింగ్ వంటివి ఏవి చేసినా తక్కువే’ అంటూ ప్రక్కన కూర్చుకున్న చిరంజీవి గారితో కలిసి సరదాగా కామెంట్ చేస్తూ ఒక పిక్ పోస్ట్ చేసారు సాయి తేజ్. కాగా ప్రస్తుతం ఈ పిక్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది…!!