ఎలక్షన్స్ లో మెరిసిన హాసిని

0
397

‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ఒకప్పుడు టాలీవుడ్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకర్షించిన బ్యూటీ జెనీలియా. బొమ్మరిల్లు హాసిని గా చెరగని ముద్ర వేసిన అమ్మడు ప్రస్తుతం సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక చాలా రోజుల తరువాత అమ్మడు మహారాష్ట్ర ఎలక్షన్స్ హడావుడిలో తళుక్కున మెరిసింది.

తన ఓటు హక్కును వినియోగించుకొని అందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని వివరణ ఇచ్చింది. ఓటు వేసిన తరువాత భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి అందంగా నవ్వుతూ సెల్ఫీకి స్టిల్ ఇచ్చింది. ఆరెంజ్ – నా ఇష్టం సినిమాల అనంతరం జెనీలియా మళ్ళీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ లో కూడా సినిమాలు మెల్లగా తగ్గించేసింది.

20012లో రితేష్ ని పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన హాసిని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక సాధారణ మహిళగా ఎలాంటి హడావుడి లేకుండా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకుంది. మహారాష్ట్రలో జరుగుతున్న ఎలక్షన్స్ లో చాలా మంది సినీ ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here