టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, తొలి రెండు సినిమాలైన ఆంధ్ర పోరి, మెహబూబాలతో నటుడిగా ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడవ సినిమా ‘రొమాంటిక్’. యువ దర్శకుడు అనిల్ పాదూరి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది.
లవ్, రొమాన్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కలగలిపి తెరక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్లో కనపడనున్నారు. మంగళవారం నుండి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారు. ఇన్టెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.