సందీప్ వంగా మరో బాలీవుడ్ మూవీ

0
889

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యువ దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్ లో కూడా అదే ఫార్ములతో సక్సెస్ అందుకున్నాడు. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్.. కబీర్ సింగ్ ఊహించని విధంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు మంచి లబాల్ని అందించింది. దీంతో మళ్ళీ ఆ నిర్మాతలు సందీప్ తోనే మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

గత కొంత కాలంగా ఈ విషయంపై పలు రకాల కథనాలు వస్తున్నప్పటికి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఫైనల్ గా ఇటీవల కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ వంగని కలుసుకోవడంతో క్లారిటీ వచ్చింది. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. క్రైమ్ డ్రామా తరహాలో సందీప్ తన తదుపరి ప్రాజెక్ట్ ని డెవలప్ చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

టైటిల్ తో పాటు సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. ఇక కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు 2019లో 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాగా కబీర్ సింగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరి నెక్స్ట్ సినిమాతో దర్శకుడు సందీప్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here