సాహో సినిమాతో ప్రభాస్ ని కొత్త తరహాలో చూపించి దర్శకుడు సుజిత్ ఆకర్షించారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో సుజిత్ ఇటీవల రీసెంట్ గా చేసిన తన ఎమోషనల్ పోస్ట్ పెట్టడానికి గల కారణాన్ని తెలియజేశాడు.
“సెకండ్ టైమ్ చూసిన చాలా మంది సినిమా అద్భుతంగా ఉందని మెస్సేజ్ లు చేశారు. కలెక్షన్స్ పెంచే ఉద్దేశ్యంతో కాకుండా మరోసారి సినిమాను చూస్తే ఎంజాయ్ చేస్తారని, క్లియర్ అర్ధమవుతుంది అని చెప్పాను. ఫైనల్ గా దేశంలో ప్రతి ఒక్కరిని మెప్పించేలా సినిమా తీయడం కష్టం. అందుకే నెక్స్ట్ టైమ్ స్టార్ట్స్ తో సినిమా చేసేటప్పుడు ప్రతి విషయాన్ని వివరించి చెప్పాలనే విషయాన్ని నేర్చుకున్నాను” అని చెప్పిన సుజిత్ ఇంటిలిజెన్స్ ని కూడా తగ్గించుకొని సినిమాలు చేయాలని వివరణ ఇచ్చారు.


