హీరో రామ్ అభిమాని ఛార్మిని కంటతడి పెట్టించారు .రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి, ఛార్మి నిర్మాతలు. ఇటీవలే వరంగల్లో ప్రీరిలీజ్ వేడుక జరుపుకొని జులై 18న విడుదలకు సిద్దమైనది.
అయితే రామ్ అభిమాని ఒకరు ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావాలని మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కాడు. ఆ వీడియో ఛార్మి కంట పడింది. ఆ వీడియోపై ఆమె స్పందిస్తూ… ‘నువ్వు నన్ను ఏడిపించావు సందీప్.. నీకు కృతజ్ఞతలు ఒక్కటి చెబితే సరిపోదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని తిరుమల మెట్లు మోకాలితో ఎక్కావు. మాపై ఎంతో ప్రేమ చూపించావు’ అని ట్వీట్ చేసింది.
U got me tears Sandeep 🙏🏻🙏🏻
Can’t thank u enough for this 🙏🏻🙏🏻
Climbing all the way up to Tirumala on ur knees so that #ismartShankar becomes a blockbuster, 🙏🏻🙏🏻
So much love n affection 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/TH0AiGbrVL pic.twitter.com/oyvtmla3kG— Charmme Kaur (@Charmmeofficial) July 9, 2019