ఛార్మిని కదిలించిన అభిమానం

0
353

హీరో రామ్ అభిమాని ఛార్మిని కంటతడి పెట్టించారు .రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి, ఛార్మి నిర్మాతలు. ఇటీవలే వరంగల్‌లో ప్రీరిలీజ్ వేడుక జరుపుకొని జులై 18న విడుదలకు సిద్దమైనది.

అయితే రామ్ అభిమాని ఒకరు ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావాలని మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కాడు. ఆ వీడియో ఛార్మి కంట పడింది. ఆ వీడియోపై ఆమె స్పందిస్తూ… ‘నువ్వు నన్ను ఏడిపించావు సందీప్‌.. నీకు కృత‌జ్ఞ‌త‌లు ఒక్క‌టి చెబితే స‌రిపోదు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని తిరుమ‌ల మెట్లు మోకాలితో ఎక్కావు. మాపై ఎంతో ప్రేమ‌ చూపించావు’ అని ట్వీట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here