ఆసక్తి రేపుతున్న అడివి శేష్ ‘ఎవరు’ ప్రీ లుక్….!

0
405

తన సినిమా కెరీర్లో విభిన్న కథ, కథనాలతో సాగె సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న యువనటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ఎవరు. పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ గా క్షణ క్షణం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తమ సినిమా రూపొందుతోందని, అందుకోసం ఇటీవల కొన్ని సన్నివేశాలు రహస్యంగా చిత్రీకరించడం జరిగిందని శేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొద్దిరోజుల క్రితం వెల్లడించారు. ఇక నేడు ఈ సినిమా ప్రీ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. లంచగొండి పోలీస్ ఆఫీసర్ గా రహస్యాలను ఒక్కొక్కరినుండి రాబట్టే విక్రమ్ వాసుదేవ్ క్యారెక్టర్ నటిస్తున్న హీరో అడివి శేష్ ముఖం సగం కనపడుతూ ఉండే ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమా ద్వారా తొలిసారి వెంకట్ రాంజీ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పివిపి బ్యానర్ పై  పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నెఅత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం, అబ్బూరి రవి డైలాగులు అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శేష్ సరసన యువ నటి రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా మురళి శర్మ, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని జులై 11 న విడుదల చేయనున్నారు కాగా ఈ సినిమాని ఆగష్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here