రేపు ఉదయం 10 గంటలకు అడివి శేష్ “ఎవరు” ప్రీ లుక్ రిలీజ్….!!

0
460

నటుడిగా మాత్రమే కాక స్క్రిప్ట్ రూపకర్తగా కూడా మంచి పేరు సంపాదించి అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో అడివి శేష్. ఇక ఇటీవల అయన నటిస్తున్న కొత్త చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్ నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఆ చిత్ర ప్రీ లుక్ ని రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. థ్రిల్లర్ నేపధ్యంలో విభిన్నమైన కథాంశంతో సాగనున్న ఈ చిత్రంతో వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

కొన్నాళ్లుగా ఈ చిత్రాన్ని గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చిత్రీకరణ జరిపామని, చిత్రంలోని ట్విస్ట్‌లు బయటికి తెలియకుండా ఉండటానికి ఈ విధంగా రహస్యంగా చిత్రీకరించినట్లు అడివి శేష్ ఇటీవల తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్‌పై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె నిర్మిస్తుండగా, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం, అబ్బూరి రవి డైలాగులు, వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంలో శేష్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని ఆగ‌స్ట్ 23న విడుదల చేయనున్నట్లు సమాచారం….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here