మేఘంశ్ శ్రీహరి నటించిన ‘రాజ్ దూత్’ సక్సెస్ అవ్వాలని విష్ చేసిన దర్శకులు శ్రీను వైట్ల , పరశురామ్..!!

0
492

దివంగత నటులు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారి తనయుడు మేఘంశ్ శ్రీహరి తొలిసారి టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం రాజ్ దూత్. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్, చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయనే చెప్పాలి. ట్రైలర్ లో ఆకట్టుకునే నటన మరియు ఫైట్స్ తో అలరించిన మేఘంశ్, రేపు సినిమా విడుదల తరువాత పెద్ద హీరోగా ఎదుగుతాడని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల, పరశురామ్ వీడియో బైట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

శ్రీహరి గారు లేని లోటు మేఘంశ్ ద్వారా తీరుతోందని, స్వర్గం నుండి తన తండ్రి శ్రీహరి గారు మేఘంశ్ ని తప్పకుండా దీవిస్తారని, భవిష్యత్తులో అతడు కూడా తండ్రివలె ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ వారిద్దరూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీడియో బైట్స్ ను పోస్ట్ చేయడం జరిగింది. దర్శక ద్వయం అర్జున్‌ – కార్తీక్‌ లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మేఘంశ్ సరసన నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here