నితిన్’భీష్మ’ టీజర్ రిలీజ్ …..!!

0
795

యువ నటుడు నితిన్ హీరోగా తొలి సినిమా ఛలో తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతాన్ని, సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో తెరెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే నేడు నితిన్’భీష్మ’ టీజర్  కాసేపటి క్రితం సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ‘మీ తరువాత మీ తరువాత మీ ఆస్తిని, ఇంతపెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేదెవరు సర్’ అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రారంభం అయ్యే ఈ టీజర్ కామెడీ డైలాగ్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ తో అదిరిపోయిందనే చెప్పాలి. ‘స్పీడ్ గా వెళ్లే స్కూటర్ కి మేకు గుచ్చుకున్నట్లు, నువ్వు నాకు గుచ్చుకున్నావేంటిరా’ అంటూ వెన్నెల కిశోర్ చెప్పే ఫన్నీ డైలాగ్ తో పాటు, ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటె దురదృష్టం దబ్బకాయంత ఉందండి’,

‘ఎవరి వేల్యూ అయినా బ్రతికి ఉన్నపుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది భయ్యా, ఒక కోడి బ్రతికి ఉన్నపుడు తొంభై రూపాయలు, అది చనిపోయినపుడు అయితే నూట తొంబై రూపాయలు ఉంటుంది కదా’ అంటూ నితిన్ చెప్పే ఫన్నీ డైలాగ్స్ బాగున్నాయి. మొత్తంగా నితిన్’భీష్మ’ టీజర్ రిలీజ్ తరువాత సినిమా పై అంచనాలు బాగానే పెరిగాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ టీజర్ కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ లభిస్తున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని ఫిబ్రవరి లో రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here