దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో కలిసి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా `వినరా వినరా రేపిక మనదేరా` అంటూ ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో పాడిన దేశ భక్తి పాటని విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉందని రామ్ చరణ్ అన్నారు.




