తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్ .టి .ఆర్ : నందమూరి బాలకృష్ణ

0
170

నాన్న గారి శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని, ఆయన ప్రభావం ప్రాభవం ఇప్పటికీ తెలుగు జాతికి స్ఫూర్తినిస్తుందనటానికి ఇదే నిదర్శనమని నందమూరి బాలకృష్ణ అన్నారు. .
ఎన్ .టి .ఆర్ శత జయంతి వేడుకల కమిటీ, చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో నందమూరి బాలకృష్ణతో ఆదివారం రోజు బేటీ అయ్యింది. ఈ సందర్భంగా కమిటీ చేస్తున్న కృషిని జనార్దన్ బాలకృష్ణకు వివరించారు . తన తండ్రే తనకు స్ఫూర్తి ప్రదాతని , ఆయన మార్గంలోనే తాను ప్రయాణిస్తున్నానని బాలకృష్ణ చెప్పారు . .
ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా తమ కమిటీ గత ఆరు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడని ఆయన చెప్పారు . జయహో ఎన్.టి.ఆర్. పేరుతో ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నామని , ఇందులో రామారావు గారికి సంబంధించిన వ్యాసాలు /వీడియోలు ఉంటాయని , అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి గా అసెంబ్లీ లో చేసిన ప్రసంగాలు , బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా తీసుకిస్తున్నామని, ‘శకపురుషుడు’ పేరుతో ఒక ప్రత్యేక సంచిక రూపకల్పన చేస్తున్నామని , ఇందులో రామారావు గారి సినిమా, రాజకీయ జీవితంపై పై విశ్లేషణాత్మక మైన వ్యాసాలు, అపురూపం ,అరుదైన ఫోటోలు వుంటాయని జనార్దన్ తెలిపారు .
తమ తండ్రి గారు సినిమా రంగంలో సాధించిన విజయాలు, చేసిన వినూత్న ప్రయోగాలు, ముఖ్యమంత్రిగా ప్రజల అభ్యున్నతికి ఆయన చేపట్టిన పథకాలు ఈనాడు దేశమంతా అమలవుతున్నాయని , అంటే ఆయన దూర ద్రుష్టి ఎలాంటిదో ఇప్పటి తరాలకు తెలుస్తుందని, వారిని ఎప్పటికీ నిలిపేలా మీరు చేస్తున్న అసామాన్యమైన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మేము కూడా ఈ కృషిలో భాగస్వాములమవుతామని బాలకృష్ణ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు .
చైర్మన్ టి .డి .జనార్దన్ , మిగతా కమిటీ సభ్యుల ను బాలకృష్ణ అభినందించారు .
ఎన్ .టి .ఆర్ శత జయంతి వేడుకలను విజయవాడ , హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జనార్దన్ తెలిపారు .
చైర్మన్ టి.డి. జనార్థన్ సభ్యులు, కాట్రగడ్డ ప్రసాద్,భగీరథ, విక్రమ్ పూల , అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్ మరియు విజయ్ భాస్కర్, గౌతమ్ బాలకృష్ణను కలసి తమ కృషిని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here