జయప్రకాశ్ మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు: ప్రధాని మోదీ

0
453

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

‘జయ ప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here