పద్మాలయ స్టూడియోస్ 50 ఏళ్ళ ప్రస్థానం లో తోడ్పడిన అందరికీ అభినందనలు : సూపర్ స్టార్ మహేష్ బాబు

0
663
పద్మాలయ స్టూడియోస్ సక్సెస్ఫుల్ గా 50 ఏళ్ళు పూర్తి

టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పద్మాలయ స్టూడియోస్ నేటితో సక్సెస్ఫుల్ గా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, మరియు ఆయన సోదరులైన హనుమంతరావు, ఆదిశేషగిరిరావు గార్లు కలిసి 1970లో తొలిసారిగా ఈ సంస్థపై కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్లుగా అగ్నిపరీక్ష సినిమాను నిర్మించడం ఆ చిత్రం జూలై 10, 1970 న విడుదలవడం జరిగింది. అనంతరం పద్మాలయ సంస్థ నుండి మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, సింహాసనం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో రూపొందాయి.

ఇకపోతే నేడు తమ పద్మాలయ స్టూడియోస్ సక్సెస్ఫుల్ గా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు. “ఈ 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పద్మాలయ స్టూడియోస్ సంస్థ యాజమాన్యానికి, టీమ్ సభ్యులకు తోడ్పాటును అందించిన అందరికీ అభినందనలుు” అంటూ పోస్ట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here