ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాధి కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా తన కుటుంబంతో కలిసి ఎంతో హ్యాపీ గా గడుపుతున్నారు. ఇకపోతే నేడు ఆయన సతీమణి నమ్రత మహేష్ ఒక సరదా వీడియో పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
కళ్ళు ఆర్పకుండా మహేష్ బాబు, గౌతమ్ ఇద్దరూ కలిసి ఆడుతున్న సరదాగా ఆడుతుండడం, ఆ ఆటలో గౌతమ్, మహేష్ ఇద్దరూ కూడా ఎంతో సరదాగా ఎంజాయ్ చేయడం గమనించవచ్చు. ఎవరైతే ముందుగా కళ్ళు ఆర్పుతారో వారు ఈ గేమ్ లో ఓడిపోయినట్లే అంటూ నమ్రత పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!!