నటుడు విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సినిమాతో నటుడిగా మంచి హిట్ ని, పేరుని గడించారు. ఆ తరువాత నుండి వరుసగా మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తున్న విజయ్, ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ వలన దాదాపుగా యాభై రోజుల నుండి సినిమా షూటింగ్స్ కూడా నిలుపుదల చేయడంతో తన సినిమాల నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని గ్రహించిన విజయ్ ఆంటోని,
మూడు సినిమాలకు గాను తన శాలరీ లో 25 శాతం తగ్గించుకుంటున్నట్లు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాగా తమ హీరో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఎంతగానో హర్షించదగినదని, ఈ విధంగానే మిగతా హీరోలు కూడా వారి సినిమాల నిర్మాతల సమస్యలు అర్ధం చేసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంత మేర శాలరీ తగ్గించుకుంటే సదరు నిర్మాతలకు కూడా కొంత ఊరటనిచ్చినట్లవుతుందని విజయ్ నటిస్తున్న మూడు సినిమాల్లో ఒక నిర్మాత, అమ్మ క్రియేషన్స్ అధినేత అయిన టి. శివ అభిప్రాయపడ్డారు…..!!