ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వలన పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక మన దేశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేసారు. అయితే దీని వలన అన్ని రంగాలు మూత పడడం, ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా ఇళ్లకు పరిమితం అవడం జరుగుతోంది.
కాగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు మాత్రం తమ ప్రాణాలొడ్డి మన రక్షణ కోసం ఎంతో గొప్పగా పాటుపడుతున్నారు. కాగా వారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తుండగా, నేడు టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పుతూ, నిజంగా ఇటువంటి విపత్కర సమయంలో ఆ మూడు శాఖల వారు మన కోసం, మన కుటుంబాల రక్షణ కోసం చేస్తున్న ఈ సేవకు విలువ కట్టలేమని, వారే నిజమైన హీరోలని కాసేపటి క్రితం ఒక వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ తెలిపారు….!!
ఈ లాక్ డౌన్ లో మన కోసం పని చేస్తున్న వైద్య బృందానికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ఇతర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు.. మీరే నిజమైన హీరోలు..
– మీ అల్లరి నరేష్#StayHome #StaySafe @allarinaresh #Naandhi@SV2Ent @SatishVegesna #Naresh57 pic.twitter.com/qJMuxI6mOg— BARaju (@baraju_SuperHit) April 18, 2020