గత కొద్దిరోజేలుగా ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాధి ప్రభాలడంతో, దానిని మరింతగా వ్యాప్తి కనివ్వకుండా అరికట్టాలని మిగతా ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా రాబోయే మే 3 వరకు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానివలన మిగతా ఇతర రంగులతో పాటు సినిమా రంగం కూడా మూత పడడంతో షూటింగ్స్ అన్ని రద్దు అయ్యాయి. కావున సినిమా నటులు అందరూ కూడా కొద్దిరోజులుగా తమ ఇళ్లకు పరిమితం అయ్యారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గత కొద్దిరోజులుగా హోమ్ క్వారంటైన్ లో తన ఫ్యామిలీ మెంబెర్స్ తో ఎంతో సరదాగా గడుపుతున్నారు.
ఇకపోతే నేడు మహేష్ బాబు తన కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఒక పోస్ట్ ని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఆయన సతీమణి నమ్రత. తను గేమ్ లో గెలవాలని గౌతమ్ ఆడుతూ ఉంటే, మధ్యలో తండ్రి కూతురు ఇద్దరూ కలిసి వాడి ఆటను చెడగొట్టారు, వెంటనే బుద్ధుడు వంటి గౌతమ్ వారిద్దరికీ సరెండర్ అయ్యాడు అంటూ తమ ఇంట్లో సరదాగా మహేష్, సితార, గౌతమ్ లు కలిసి ఆడుతున్న ఆట గురించి సరదాగా పోస్ట్ చేసారు నమ్రత. ప్రజలందరూ ఈ మహమ్మారి కరోనా బారిన పడకుండా ఎవరికి వారు తమ తమ ఇళ్లలో జాగ్రత్తగా ఉండండి అంటూ తన పోస్ట్ లో తెలిపారు నమ్రత….!!