ప్రస్తుతం కరోనా కారణంగా మిగతా ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా కొన్నివారాల పాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లకు అంకితం కావలసిన పరిస్థితి తలెత్తింది. అలానే లాకౌట్ వలన పలు ఇతర రంగాల తో పాటు సినిమా రంగం వారు కూడా లాకౌట్ పూర్తయ్యే వరకు అన్ని సినిమాల షూటింగ్స్ ని రద్దు చేయడం జరిగింది.
దానితో సినీ తారలందరూ కూడా ఈ సమయంలో తమ ఫ్యామిలీలతో గడుపుతున్నారు. ఇక నేడు టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ తన కుమార్తె, కుమారుడితో పాటు మిగతా ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కాసేపటి క్రితం నుండి పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం మాస్ రాజా, యువ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే….!!