అబ్బూరి రవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో విలన్ ఎలా ఉండాలని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు… ‘చావులో కూడా భయం ఉండకూడదు’ అని మామూలుగా మాట్లాడుకునే పద్దతిలో సాయికిరణ్ అడివిగారికి చెప్పాను. చాలామందిని విలన్ కోసం చూశారు. సడన్గా ఒక రోజు వచ్చి, ‘మీరే విలన్’ అన్నారు. ఓ నాలుగు నెలలు పాటు మా బావమరిదిని నా గెస్ట్ హౌస్కి పంపించి, ‘అక్కడ ఎక్కడన్నా సాయికిరణ్ ఉన్నాడేమో చూడండి’ అని అడిగేవాడిని. సాయికిరణ్ ఉంటే కారులో కూర్చుని రాసుకునేవాడిని. నేను ఆర్టిస్టును కాను. రైటర్ని. నటించాలని అనుకోలేదు. నా చుట్టూ నాలుగు నెలలు తిరిగాడు. ‘మన యాక్షన్ చూస్తే తనే వదిలేస్తాడు’ అనుకున్నా. మేకప్ టెస్ట్ చేశాక… నాకూ ఆ లుక్ కొంచెం నచ్చింది. బాగానే ఉన్నానని అనుకున్నా. మామాలుగా నేను ప్రతి ఉదయం పూజ చేసి, బొట్టు పెట్టుకుంటాను. అటువంటి నన్ను ఇండియాను తిట్టమంటాడు. కశ్మీర్ పండిట్స్ను చంపమంటాడు. క్యారెక్టర్ ప్రకారం. అది నా వల్ల కాదు. ఎందుకంటే… నా బ్లడ్లో దేశభక్తి ఉంది. ఒక సన్నివేశలో జీహాద్ అనాలి. టేక్ అయిపోయింది. కానీ, నేను జైహింద్ అన్నాను. చుట్టుపక్కల నాతో ఉన్న టెర్రరిస్టులు కూడా జైహింద్ అన్నారు. సాయికిరణ్ కూడా ఓకే అన్నాడు. తర్వాత ‘జైహింద్ కాదు సార్, జీహాద్ అనాలి’ అన్నాడు. పిఎంవో, జమ్ము కశ్మీర్ సొసైటీ, హైదరాబాద్లో ఉన్న కశ్మీర్ పండిట్స్తో మాట్లాడి స్ర్కిప్ట్ రాశాం. మొత్తం సినిమా కశ్మీర్ పండిట్స్ సమస్య మీద కాదు. కానీ, మనం టచ్ చేస్తున్న ఏ ఒక్కటీ అబద్దం కాకూడదని వర్క్ చేశాం. ఇండియా తాలూకు ఎమోషన్ టచ్ చేసే మేటర్ కనుక, కల్పితాలు మాట్లాడకూదనుకున్నాం. అందుకని, ఆర్టికల్ 370, 35ఎ గురించి మొత్తం తెలుసుకుని సినిమా చేశాం. ఆర్టిస్టుగా నేను సరిపోయానా? లేదా? అని మీరు (ప్రేక్షకులు) చెప్పాలి’’ అన్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ మధ్య కాలంలో సినిమా బయటకు రావాలంటే ఎన్ని వ్యయప్రయాసలు పడాలో నాకు తెలుసు. ఇటువంటి మంచి డేట్ ఎంచుకుని, సినిమాను విడుదల చేయడం కష్టసాధ్యమైన విషయం. ఈ టీమ్ ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చి ఇక్కడవరకూ వచ్చారో నాకు తెలుసు. కాంటెంపరరీ కశ్మీర్ ఇష్యూతో సినిమా తీశారు. ఈ సినిమాలో నాలుగు మంచి పాటలు కుదిరాయి. అన్నీ ప్రజాదరణ పొందాయి. గాంధీ జయంతికి కీరవాణిగారు పాడిన ‘మహాత్మ’ పాట విడుదల చేశాం. రీ రికార్డింగ్ పండిట్ శ్రీచరణ్ పాకాల మరోసారి అదరగొట్డాడు. సరైన సమయంలో సినిమా విడుదలవుతుంది. వీళ్లందరి కృషిలో ఒక నిజాయతీ, ఒక పద్దతి, ఒక సత్యం ఉన్నాయి. ఈ సినిమాకు మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘అక్టోబర్ 18కి కొన్ని రోజులే ఉంది. ఈ సినిమాకు అందరూ కష్టపడి పని చేశారు. ఈ సినిమాతో సాయికిరణ్ అడివి నాకు బ్రదర్లా అయ్యారు. ఒక సినిమాను మనిషి ఇంత ప్రేమిస్తాడా? అని ఫస్ట్ టైమ్ సాయికిరణ్ అడివిగారిని చూసి అనుకున్నాను. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. ఈ రోజుల్లో సినిమా విడుదల కావడం పెద్ద విషయం. సాయికిరణ్గారు ఇంటికి వెళ్లకుండా ఎడిటింగ్ రూమ్లో నిద్రపోయి ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది’’ అన్నారు.
నిత్యా నరేష్ మాట్లాడుతూ ‘‘సినిమా కోసం ఎంతైనా కష్టపడే వ్యక్తుల్లో సాయికిరణ్ అడివిగారు ఒకరు. స్ర్కిప్ట్ వర్క్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్లో ఆయన చాలా డిడికేషన్తో వర్క్ చేశారు. నేను మిలటరీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కిన ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి.
బ్యానర్: వినాయకుడు టాకీస్
కాస్ట్యూమ్ డిజైనర్: కీర్తి
ఫైట్స్: రామకృష్ణ, సుబ్బు-నభా
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
ఎడిటర్: గ్యారీ .బిహెచ్
సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల
స్క్రిప్ట్ డిజైన్: అబ్బూరి రవి
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ
కో ప్రొడ్యూసర్: దామోదర్ యాదవ్ (వైజాగ్)
నిర్మాతలు: ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల, మిగతా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: సాయికిరణ్ అడివి