మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 2 కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న మెగా అభిమానుల ఎదురు చూపులకి బుధవారం తెరపడనుంది. అయితే మెగాస్టార్ తన స్టామినతో రిలీజ్ కు ముందే సాలీడ్ ఓపెనింగ్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది.
హిస్టారికల్ మూవీ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూడాలని ఆసక్తిగా ఉన్నారు. రీసెంట్ గా ఆన్లైన్ లో టికెట్స్ దర్శనమివ్వడంతో నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో అభిమానులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. దీంతో మంగళవారానికి అన్ని ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దసరా సెలవలు కూడా ప్రారంభమవడంతో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. మరి మొదటి రోజు ఆ రికార్డుల డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.