ఒక్క సినిమా.. 7 దేశాల్లో షూటింగ్!

0
447

ప్రయోగాత్మక పాత్రలతో సినిమాపై అంచనాలు పెంచగల టాలెంటెడ్ కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ నెక్స్ట్ ధృవనచ్చత్రం అనే సినిమాతో రాబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా విక్రమ్ డిఫరెంట్ యాక్టింగ్ తో మెప్పించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. సినిమా సరికొత్త ఫీల్ ని కలిగించేలా మునుపెన్నాడు చూడని లొకేషన్స్ చిత్రీకరించారట. దాదాపు ఏడు దేశాల్లో సినిమా షూటింగ్ ని నిర్వహించినట్లు గౌతమ్ మీనన్ వివరణ ఇచ్చాడు. ప్రతి సీన్ డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు చెబుతూ.. ప్రస్తుతం తన డైరెక్షన్ లో సిద్దమైన ‘ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట’ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుందని ఆ రోజు విక్రమ్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here