శర్వానంద్ ‘రణరంగం’ రెండవ పాట ‘కన్నుకొట్టి’ విడుదల…!!

0
693

యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం రణరంగం. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే మరియు కథ, కథనాలతో సినిమాలు తీయడంలో మంచి పేరు గడించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వా సరసన కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1990ల కాలంనాటి గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచిఅంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు సీతా కళ్యాణం అనే సాంగ్ వీక్షకులను ఎంతో అలరించాయి. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటను ఈ రోజు విడుదల చేశారు.

‘కన్నుకొట్టి చూసెనంట సుందరి, మనసు మీటి వెళ్లేనంట మనోహరి’ అనే పల్లవితో సాగిన ఈ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ని సంగీత దర్శకుడు కార్తీక్ స్వయంగా ఆలపించడం జరిగింది. ఇక ఈ పాటకు కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం ప్రధానాకర్షణ. హృద్యమైన సంగీతంతో యువతను ఎంతో ఆకట్టుకునే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో ముందుకు సాగుతోంది.కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, ప్రియదర్శిని ల మధ్య ఉన్న ప్రేమ కు చక్కని వెండితెర రూపం ఈ పాట. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త ధనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు….!!

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here