సెన్సార్ పూర్తిచేసుకున్న ‘నిను వీడని నీడను నేనే’

0
383

యువ సంచలన నటుడు సందీప్ కిషన్ తొలిసారి నటిస్తూ తన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ప్రొడక్షన్స్, అలానే దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్ తో కలిసి వి స్టూడియోస్ వారి భాగస్వామ్యంతో, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాతగా రూపొందిస్తున్న కొత్త సినిమా ‘నిను వీడని నీడను నేనే’. థ్రిల్లింగ్ హర్రర్ తో పాటు, కామెడీ ప్రధానంగా సాగె ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదల తరువాత తమ సినిమాపై అంచనాలు మరింతగా పెరగడంతో, వాటిని తప్పకుండా అందుకుని మంచి సక్సెస్ సాధిస్తాం అనే నమ్మకం ఉంది అని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నేడు సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ ని సంపాదించింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారని సమాచారం. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here