మిలియన్ వ్యూస్ తో “దొరసాని” ట్రైలర్….!!

0
302

నూతన నటీనటులు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం దొరసాని. కొన్నేళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతంలోని దొరల పాలన సమయంలో జరిగిన ఒక యదార్ద గాధ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, అలానే అప్పట్లో ఆ ప్రాంతంలోని కొందరు యువత ఎందుకు నక్సలైట్లుగా మారారు అనే అంశాన్ని కూడా చిత్రంలో ప్రస్తావించినట్లు సమాచారం. విడుదలైన ట్రైలర్ లో ఆనంద్, శివాత్మిక నటన, కదిలించే డైలాగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు చిత్రం పై అంచనాలను అమాంతం పెంచాయి.

ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించి వీక్షకుల నుండి మంచి స్పందనతో దూసుకుపోతోంది. ట్రైలర్ మాదిరిగానే రేపు తమ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంతో కేవీఆర్ మహేంద్ర అనే దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here