నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తాను స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టిపెట్టడం జరిగింది. ప్రస్తుతం అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎక్స్ మినిస్టర్ హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ గారు వెళ్లి కలిసి, తమ పార్టీ ఆధ్వర్యంలో స్థాపించే ఫిలిం ఇన్స్టిట్యూట్ విషయమై మాట్లాడారు. ఇక ఆ ఇన్స్టిట్యూట్ కు చైర్మన్ గా నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వ్యవహరించిన హరిరామజోగయ్య గారిని, అలానే పర్యవేక్షకులుగా రాజా వన్నెంరెడ్డి, మరియు బన్నీ వాసు గార్లను నియమిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలలోని యువత కోసం ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నాం అని, అయితే ఇదే పాలకొల్లు నుండి శ్రీ ఎస్ వి రంగారావు గారు, దాసరి నారాయణ రావు గారు, అల్లు రామలింగయ్య గారు, కోడి రామకృష్ణ గారు వంటి గొప్ప వ్యక్తులు ఎందరో వచ్చారని, ఈ ఇన్స్టిట్యూట్ కు నటసార్వభౌమ శ్రీ ఎస్ వి ఆర్ గారి పేరు పెట్టడం జరుగుతుందని వారు తెలిపారు. తమ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన మరియు దర్శకత్వ విభాగంలో యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అందుకోసం నిపుణులు సిద్ధంగా ఉన్నారని వారు ఆ ప్రకటనలో తెల్పడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నడువనున్న ఈ ఇన్స్టిట్యూట్ ను అతి త్వరలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని చైర్మన్ హరి రామ జోగయ్య అన్నారు….!!