సూపర్ స్టార్ మహేష్ బాబు హరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వినిదత్, దిల్ రాజు, పివిపి వంటి దిగ్గజ నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా విడుదలైన మహర్షి, ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే 213 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న మహర్షి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ మంచి కలెక్షన్లతో కొన్ని థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే వుంది.
ఈ చిత్ర సక్సెస్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఒక ముఖ్య భూమిక పోషించింది. ఇక ఈ చిత్రంలోని ‘చోటి చోటి బాతే’ సాంగ్ ఇప్పటికే పూర్తి వీడియో విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈ చిత్రంలోని ‘ఎవరెస్ట్ అంచున’ అని సాగే డ్యూయెట్ పూర్తి వీడియోను చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాట కూడా వీక్షకుల ఆదరణతో మంచి వ్యూస్ తో ప్రస్తుతం దూసుకుపోతోంది…..!!