“దొరసాని” ట్రైలర్ లాంచ్ చేయనున్న దర్శకులు సుకుమార్….!!

0
339

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటీనటులు జీవిత, రాజశేఖర్ గారి తనయ శివాత్మిక హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ మరియు పాటలు ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ ను బ్రిలియంట్ దర్శకులు సుకుమార్ చేతులమీదుగా జులై 1వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు .

తెలంగాణ ప్రాంతంలో 1980వ దశకంలో దొరల కాలం నాటి సమయంలో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతుండగా సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని జులై 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here