దేశమంతా ఈరోజు రిపబ్లిక్డే ఉత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మేరా భారత్ మహాన్ నినాదం దేశమంతా మార్మోగుతుంది. ఊరూ .. వాడా.. వీధి ప్రతిచోటా జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తూ సందడి చేస్తున్నారంతా. అయితే అందరిలాగా చేస్తే రొటీన్ అనుకున్నారో ఏమో అల్లు వారు కొత్తగా ప్లాన్ చేశారు.
జాతీయ జెండాని కొత్తగా ప్రెజెంట్ చేసి దేశభక్తిని చాటుకున్నారు. మువ్వన్నెల జెండాపై అల్లు వారి మనవరాలు ..బన్ని గారాల కుమార్తె అర్హ ఫోటోని ప్రింట్ చేసి దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖలో నేడు జరుగుతున్న తెలుగు యువత మౌన పోరాటానికి మెగా హీరోలంతా ఎటెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ వెళ్లలేకపోతున్నారని తెలిసింది.


