మూడు సినిమాలతో బిజీగా ఉన్న నిర్మాత

0
380

ఒక్క పెద్ద సినిమా నిర్మించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, మూడు పెద్ద ప్రాజెక్ట్ లతో కూడా నిర్మాత ‘ఠాగూర్’ మధు తన పని తాను సాఫీగా చేసుకెళ్ళిపోతున్నారు. ఆయన ఈ సంక్రాంతి సెట్లోనే జరుపుకుంటున్నట్టుంది. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న మూడు చిత్రాల షూటింగ్ ల తో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ – మురుగదాస్ కాంబినేషన్ సినిమా షూటింగ్  హైదరాబాద్ అమీర్ పేట్ ప్రాంతంలో ఉన్న జెనెటిక్స్ భవన సముదాయంలో జరుపుకుంటుండగా, అయన నిర్మిస్తున్న మరో సినిమా వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల ల ‘మిస్టర్’ షూటింగ్ గచ్చిబౌలి లో జరుగుతోంది. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న మూడో సినిమా సాయి ధరమ్ తేజ్ – గోపీచంద్ మలినేని ల ‘విన్నర్’ చిలుకూరు లో షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాత మధు ఒకే సారి జరుగుతున్న ఈ మూడు సినిమాల షూటింగ్ లతో  బిజీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here