తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త చిత్రం హీరో తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్, 2027 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్
హనుమాన్ తో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన సూపర్ యోధ చిత్రం ‘మిరాయ్’ లో నటిస్తున్నారు. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా తన కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది మిరాయ్ తరువాత తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొలాబరేషన్ లో సెకండ్ మూవీ అవుతుంది.
ఈ కొత్త సినిమా కూడా మిరాయ్ చాలా గ్రాండ్ స్కేల్లోనే తెరకెక్కబోతుంది. నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్తో, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.
కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది. బ్లాక్, రెడ్ షేడ్స్తో డిజైన్ చేసిన పోస్టర్లో “రాక్ ఆన్” జెశ్చర్ చేస్తూ ఓ చేయి కనిపిస్తుంది. చేతిలో గేమ్ కంట్రోలర్ పట్టుకుని ఉండటం క్యురియాసిటీ పెంచింది.
“From Rayalaseema to the end of the world” అనే ట్యాగ్లైన్ మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ కథ రూట్స్కి రీజనల్ టచ్, స్టోరీ స్కేల్ లో గ్లోబల్ లో ఉండబోతుందని సూచిస్తోంది.
ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచుతూ ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతి 2027కి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.



