ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
నవంబర్ 4న సాయంత్రం 06:06 గంటలకు అగ్ర కథానాయిక సమంత ఈ ట్రైలర్ని లాంచ్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్, దానిలోని ఆసక్తికరమైన మరియు ప్రత్యేక లక్షణాల కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల మేకర్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. నవంబర్ 17 నుండి థియేటర్లలో ప్రేక్షకులు ఈ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఆస్వాదిస్తారని విశ్వసిస్తున్నారు.
తెలుగులో “సైడ్ ఎ” ఘనవిజయం సాధించినట్లుగానే, “సైడ్ బి” కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ప్రతిభావంతుడైన హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి తన కెమెరా పనితనంతో కట్టి పడేయగా, చరణ్ రాజ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.
In the world of destiny, do promises find their home, or like lost ships, to the unknown they roam?
Sapta Sagaralu Dhaati – Side B trailer is OUT NOW ♥️#SSDSideBTrailer : https://t.co/u1k231HFa4#SSDSideBNov17 @rakshitshetty @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_… pic.twitter.com/TH8lXTpyIZ
— BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2023
ట్రైలర్ లాంచ్ ఈ ఆకర్షణీయమైన ప్రయాణంలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
నవంబర్ 17న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” ఘనంగా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
చిత్రం: సప్త సాగరాలు దాటి
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్
రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల



