దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ ”తెలుగులో మాకు ఇది తొలి సినిమా. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. మాకు ఇది చాలా మ్యాజికల్ మూమెంట్. అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. సమంత గారికి చాలా పెద్ద థాంక్స్. ఆవిడ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వరలక్ష్మీ గారు వెర్సటైల్ యాక్టర్. మణిశర్మ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మా కలను తమ ఆర్ట్ వర్క్ ద్వారా నిజం చేసిన అశోక్ గారికి థాంక్స్. సుకుమార్ గారు హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, పని చేసిన సాంకేతిక నిపుణులకు థాంక్స్. ‘యశోద 2’కు విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్కు లీడ్ కూడా ఉంది. అయితే… అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంతగారు ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. మా నిర్మాత గారూ రెడీగా ఉన్నారు. ‘యశోద 2’లో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది. మా సినిమాలో సూపర్సైంటిస్ట్ ఉన్నిముకుందన్ ఉన్నారు. అతను ఏమైనా చేయగలడు (నవ్వుతూ). యాక్షన్ డైరెక్టర్స్ యానిక్ బెన్, వెంకట్ గారు ఇంట్రెస్టింగ్ ఫైటింగ్స్ కంపోజ్ చేశారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ గారు, డా. చల్లా భాగ్యలక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్. ఇదొక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. కమర్షియల్ పంథాలో తీసినప్పటికీ… ఎమోషన్ ఉంది. ఆ భావోద్వేగాలు అందరికీ రీచ్ అయ్యేలా మాటలు రాశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారికి థాంక్స్” అని అన్నారు.
కల్పికా గణేష్ మాట్లాడుతూ ”ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరించి ఇంత పెద్ద విజయం అందించడం, మేం సాధించిన అతిపెద్ద ఘనత. ఈ రోజు సమంత గారిని ఇక్కడ మిస్ అవుతున్నాం. సినిమాలో మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఈ సినిమాతో ప్రజల్లో అవగాహన వస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
సినిమాను హిందీలో విడుదల చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్ మాట్లాడుతూ ”మాకు అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. హిందీలో 750 థియేటర్లలో విడుదల చేశాం. అన్నిటిలో సినిమా విజయవంతంగా ఆడుతోంది. రెవెన్యూ పరంగా తొలి రోజు స్లోగా మొదలైనా… శని, ఆదివారాల రిపోర్ట్స్ బావున్నాయి. సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. స్టడీగా ఉన్నాయి. విజయశాంతి గారు ‘కర్తవ్యం’తో సూపర్ స్టార్ అయ్యారు. ‘అమ్మోరు’తో సౌందర్య గారు, ‘అరుంధతి’తో అనుష్క గారు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడీ ‘యశోద’ సమంత గారు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు” అని అన్నారు.
రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ”ఈ క్షణం ఇక్కడ నిలబడటానికి కారణం మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు. ‘మీరు రాయగలరు. రాయండి. మీ ఇద్దరూ సక్సెస్ అయితే చూడాలని ఉంది’ అని మమ్మల్ని ఆశీర్వదించారు. ముందుగా ఆయనకు థాంక్స్. తమిళ్ తెలిసిన అమ్మాయి, తెలుగు నేటివిటీ తెలిసిన అబ్బాయి కలిసి పని చేస్తే బావుంటుందని, కథకు న్యాయం చేస్తారని ఆయన అన్నారు. కృష్ణప్రసాద్ గారికి ఉన్న ట్రెండీ మనసు ఇంకొకరికి ఉండదు. మాకు అవకాశం ఇచ్చిన హరి, హరీష్ గారికి థాంక్స్. ఇద్దరు కలిసి ఎలా పని చేయాలో వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. మమ్మల్ని హేమాంబర్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సినిమాకు కొత్త రచయితలతో మాటలు రాయించుకోవడానికి యాక్సెప్ట్ చేసిన సమంతగారికి ధన్యవాదాలు. యశోదలో వరలక్ష్మి గారి కేరక్టర్ చాలా బాగా కుదిరింది. ఆవిడ ఇండస్ట్రీలో పదేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.