కొత్త ఆరంభం ప్రారంభమైన రోజు… స్వాతంత్య్రం మనకి గొప్ప విజయంగా మారినప్పుడు స్వేచ్ఛ మనకు దారిని చూపిస్తుంది అని అన్నారు సూపర్స్టార్ మహేష్ బాబు. ట్విట్టర్ ద్వారా భారతీయులందరికి సూపర్స్టార్ మహేష్ ‘74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. ఈ సమయంలో అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది జైహింద్.. అని సూపర్స్టార్ పేర్కొన్నారు.
ప్రస్తుతం గీత గోవిందం వంటి బ్లాక్బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వంలో `సర్కారువారిపాట` సినిమా చేస్తున్నారు సూపర్స్టార్ మహేష్బాబు. ప్రస్తుత కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.