సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటైనా, సోషల్ మీడియా లో అయినా మహేష్ ఫ్యాన్స్ సందడే వేరు. మహేష్ కూడా ఫాన్స్ కి దగ్గిరగా ఉంటూ వివిధ మార్గాలు, వేదికల ద్వారా వారిని కలుస్తుంటారు. ప్రస్తుత కరోనా క్రైసిస్ లో అభిమానులకు మహేష్ తన సోషల్ మీడియా లో ఒక సందేశం పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన పుట్టినరోజున సామూహిక వేడుకలు జరపొద్దని, అందరూ సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ క్షేమంగా ఉండాలని అన్నారు. అభిమానులందరూ తనకు తోడుగా ఉండడం తన అదృష్టమని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.