మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగా మేకర్ సి అశ్వనీదత్ నిర్మించిన మెమొరబుల్ హిట్ జగదేకవీరుడు అతిలోక సుందరి విడుదలై ఈ మే 9 కి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అశ్వనీదత్ మీడియా తో మాట్లాడారు. జగదేకవీరుడు గురించిన సంగతులతో పాటూ ప్రస్తుతం తాము నిర్మిస్తున్న చిత్రాల గురించి కొన్ని విశేషాలు చెప్పారు, ఆయన మాటల్లోనే…
“యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేసే సినిమా ప్రపంచ భాషల్లో సంచలనం సృష్టించేలా ఉంటుంది. రానున్న రెండున్నర సంవత్సరాలు మా సంస్థ ఆ ప్రెస్టీజియస్ పిక్చర్ వర్క్ లో ఉంటుంది. ఫారిన్ టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేస్తారు. జగదేకవీరుడు అతిలోక సుందరి 2 తీయమని అందరూ అడుగుతున్నారు. ప్రభాస్ సినిమా పూర్తయ్యాక తప్పకుండా జగదేకవీరుడు 2 చేస్తాను. ఎవరితో, ఎలా అనేది ప్లాన్ చేయాలి”, అన్నారు మెగా మేకర్ సి అశ్వనీదత్.