క‌రోనా క్రైసిన్ చారిటీ కి షైన్ స్క్రీన్స్‌ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది రూ. 5 ల‌క్ష‌ల విరాళం

0
668
Shine screen MD announced 5 Lakhs

క‌రోనా వ్యాప్తి నిరోధం, లాక్‌డౌన్‌లో భాగంగా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఆదాయం లేక అల్లాడుతున్న సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ఏర్పాటైన క‌రోనా క్రైసిన్ చారిటీ (సీసీసీ)కి షైన్ స్క్రీన్స్‌ బ్యాన‌ర్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది రూ. 5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.

దిన‌స‌రి వేత‌నం మీద ఆధార‌ప‌డి బ‌తికే పేద క‌ళాకారులు, సినీ కార్మికుల‌ను ఆదుకోవాల‌నే పెద్ద మ‌న‌సుతో ఏర్పాటైన సీసీసీకి త‌మ వంతుగా ఈ చిన్న ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామ‌ని వారు తెలిపారు. అదే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌నీ, లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రిస్తూ త‌మ త‌మ ఇళ్లల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌నీ వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here