సక్సెస్ఫుల్ గా బెల్జియం షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్ 20 టీమ్…..!!

0
761
Prabhas20

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే ల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రభాస్20 గత షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. ఇక ఇటీవల బెల్జియంలో ప్రారంభం అయిన లేటెస్ట్ షెడ్యూల్ నేటి తో పూర్తి అయిందని ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కాసేపటి క్రితం ప్రభాస్ తో సహా సినిమాలోని ముఖ్యమైన సభ్యులు ఫ్లైట్ లో దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని కుదిపేస్తున్నా, దానిని లెక్కచేయకుండా ప్రభాస్20 యూనిట్ మొత్తం కూడా బెల్జియంలో గడ్డకట్టించే పది డిగ్రీల చలి, వానలో సైతం షూటింగ్ ని నిర్వహించడం జరిగింది. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here