‘ఎవరు’ ట్విస్ట్ కి దర్శకేంద్రుడు ఫిదా

0
462

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఎవరు సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15 రిలీజైన ఈ సినిమాకు కామన్ ఆడియెన్స్ నుంచి సినీ పరిశ్రమ ప్రముఖుల వరకు అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నుంచి కూడా ఎవరు చిత్ర యూనిట్ పాజిటివ్ కామెంట్స్ ను అందుకుంది.

మంచి చిత్రాలపై మనస్ఫూర్తిగా స్పందించే దర్శకేంద్రుడు చిత్ర యూనిట్ పడిన కష్టానికి తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా అభినందనలు చెప్పారు. ముఖ్యంగా సినిమాలో ట్విస్ట్ కి తన మైండ్ బ్లో అయ్యిందని అన్నారు. సినిమాలో ప్రతి బిట్ ని ఎంజాయ్ చేశాను అంటూ.. దర్శకుడు వెంకట్ రాంజీ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను హ్యాండిల్ చేసినట్లు చెప్పారు. అలాగే కథానాయకుడు అడివి శేష్ కథానాయిక రెజీనా అద్భుతంగా నటించారని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ పివిపి కి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఘవేంద్రరావు ట్వీట్ కి ఆడివిశేష్ బాదులిస్తూ.. చాలా కృతజ్ఞతలు సర్ అని రీట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here