బాలీవుడ్ స్టార్ హీరోగానే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఈ ఇండిపెండెన్స్ డే సందర్బంగా మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ తారాగణంతో వచ్చిన మిషన్ మంగళ్ మొదటి రోజు పాజిటివ్ టాక్ తో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను అందుకుంది.
గతంలో అక్షయ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్స్ మిషన్ మంగళ్ తో సాధించినట్లు బాక్స్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటిరోజు 29.16కోట్లను అందుకుంది. ఇక గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన గోల్డ్ మొదటి రోజు 25.25కోట్ల వసూళ్లను అందుకోగా.. 2017 ఆగస్ట్ 11కి వచ్చిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ 13.10కోట్లను అందుకుంది. అలాగే 2016 ఆగస్ట్ 12న రిలీజైన రుస్తోమ్ సినిమాకు 14.10కోట్లు వచ్చాయి.