పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో సంక్రాంతి వరకు ‘2.0’ రన్ అవుతుంది ఎన్.వి.ఆర్ సినిమా అధినేత ఎన్.వి.ప్రసాద్

0
412

సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన విజువల్ వండర్ ‘2.0’. ఈ చిత్రం నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 500 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎన్.వి.ఆర్. సినిమా అధినేత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం అంతా ఎలెక్షన్ మూడ్‌లోనే ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్‌గారికి ‘2.0’ యూనిట్ అభినందనలు తెలియజేస్తోంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌గారు ఎలా దూసుకెళ్తున్నారో.. మా సినిమా కూడా అలాగే విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన మా ‘2.0’ డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే రికార్డు సృష్టిస్తోందని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఈ సినిమా సంక్రాంతి వరకు ఫ్యామిలీ ఆడియన్స్, చిల్డ్రన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఇంతటి గొప్ప సినిమాని మాకు అందించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారికి, లైైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్‌కు ధన్యవాదాలు’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here