సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం.. 27 న గ్రాండ్ రిలీజ్.. !!

0
309
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న  ఈ సినిమా  శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది..ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతలు సాంగ్ కి మంచి  ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో  జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: శ్రీవాస్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
కళ: ఎఎస్ ప్రకాష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హెయిన్
PRO: వంశీశేఖర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆడియో: జంగిల్ మ్యూజిక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here