సూపర్స్టార్ రజనీ కాంత్ హీరోగా సంచలనాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న `2.o` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ దశలో ఉంది. తాజాగా మొదలైన ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. తదుపరి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్పై దర్శకుడు శంకర్ పనిచేయనున్నాడు.
2010లో `రోబో` రిలీజై సంచలన విజయం సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు శంకర్. తెలుగు, తమిళ్, హిందీ సహా దేశ, విదేశాల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ఏకంగా 450 కోట్ల బడ్జెట్ని ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రంలో అమీజాక్సన్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ విలన్గా కనిపించనున్నాడు. రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్రలో మెరవనున్నారని సమాచారం. ప్రఖ్యాత లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆస్కార్ గ్రహీత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైన్ అందిస్తున్నారు. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.